
జపాన్, సూర్య న్యూస్ డెస్క్ : జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో (Asian Games) భారత మహిళల హాకీ జట్టు (Indian Women’s Hockey Team) అద్భుతమైన శుభారంభం చేసింది. పూల్-బి విభాగంలో జరిగిన తమ ఓపెనింగ్ మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై ఏకంగా 19-0 భారీ గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో సత్తా చాటింది.
ఒంటరిగా 8 గోల్స్ చేసిన దీపిక
ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత క్రీడాకారిణులు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఏ దశలోనూ ఉజ్బెకిస్తాన్ కోలుకోలేని విధంగా వరుస గోల్స్తో విరుచుకుపడ్డారు. భారత జట్టు గోల్స్ వర్షం కురిపిస్తుంటే, ఉజ్బెకిస్తాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేక పూర్తిగా చేతులెత్తేసింది.
ఈ ఏకపక్ష పోరులో భారత స్టార్ ప్లేయర్ దీపిక అద్భుత ప్రదర్శనతో కదం తొక్కింది. ప్రత్యర్థి డిఫెన్స్ను చీల్చుకుంటూ ఆమె ఏకంగా 8 గోల్స్ సాధించి జట్టు భారీ విజయంలో కీలక పాత్ర పోషించింది. మిగతా క్రీడాకారిణులు సైతం సమిష్టిగా రాణించడంతో భారత్ ఈ అద్భుత విజయాన్ని నమోదు చేసి, తదుపరి మ్యాచ్లకు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



