నగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు: రూ. 1511 కోట్ల ఆస్తులు స్వాధీనం
హైదరాబాద్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, చెరువులు మరియు పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా (HYDRAA) తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మంగళవారం నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాలలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు రూ. 1511 కోట్ల విలువైన భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించడమే కాకుండా, సదరు భూములకు రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ బోర్డులను అమర్చారు. కొండాపూర్లో చెరువు భూమి స్వాధీనం శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొండాపూర్లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ‘జంగం కుంట’ను హైడ్రా అధికారులు రక్షించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చెరువు భూమిని పూడ్చివేస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన అధికారులు, రెవెన్యూ శాఖతో కలిసి ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణలను తొలగించి, సుమారు రూ. 700 కోట్ల విలువైన ఈ భూమికి ఫెన్సింగ్ వేశారు. అల్వాల్ కొత్త చెరువులో ఆక్రమణల తొలగింపు అల్వాల్ మండలంలోని కొత్త చెరువు ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో వెలిసిన అనధికారిక కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో...