Skip to content

అమీర్‌పేట్ మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం: ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి దూకిన విద్యార్థులు

అమీర్‌పేట్ భవనం వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు.

హైదరాబాద్‌లోని బిజీ ప్రాంతమైన అమీర్‌పేట్‌లో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవించింది. మైత్రివనం నీలగిరి బ్లాక్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కారణంగా లోపల ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.