|   
🔴 BREAKING NEWS ► Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే Rahul Gandhi Viral Photo : రాహుల్ గాంధీ పక్కన ఉన్న మహిళ ఎవరు? కేంద్ర మంత్రి ప్రశ్నకు కాంగ్రెస్ కౌంటర్ Weather Report : ఏపీ, తెలంగాణకు ముంచుకొస్తున్న భారీ ముప్పు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ Trainee IPS Case : సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు.. ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారంటూ ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు!
Skip to content

Telangana Jobs Issue : 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన మంత్రి పొంగులేటి.. రామకృష్ణ కొలుకులపల్లి సంచలన ఆరోపణలు

Hyderabad, Surya News: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల (Unemployed Youth) ఉద్యమం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ల (Job Notifications) భర్తీపై తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి పరిషత్ ఆరోపించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ (OU NJAC) నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రెవెన్యూ శాఖలో 2025లో ఆర్థిక శాఖ (Finance Department) ఆమోదం పొందిన 10,954 జీపీవో పోస్టుల (GPO Posts) వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 2025 సంక్రాంతి కానుకగా వీటికి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని పక్కనపెట్టి పాత వీఆర్ఓ, వీఆర్ఏలతో (VRO and VRA) 5,106 జీపీవో పోస్టులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భర్తీ చేశారని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ కొలుకులపల్లి (ఆర్కే వన్నార్ చోళ) మండిపడ్డారు.

మిగిలిన సుమారు 5,848 జీపీవో పోస్టులను వెంటనే నిరుద్యోగులతో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం (State Government) నాటకాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. దీనివల్ల దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న రెవెన్యూ శాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పలు నోటిఫికేషన్లు రద్దు కావడం నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. గతంలో నిర్వహించిన పలు పోటీ పరీక్షలు (Competitive Exams) వాయిదా పడటం మరికొన్నింటిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో యువత ఆందోళన చెందుతోంది. మెగా డీఎస్సీ మరియు గ్రూప్స్ పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రెవెన్యూ శాఖలో సైతం పోస్టుల సర్దుబాటు పేరుతో తమకు దక్కాల్సిన ఉద్యోగాలను పాత వారితో భర్తీ చేయడంపై నిరుద్యోగ సంఘాలు (Unemployed Unions) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని రామకృష్ణ కొలుకులపల్లి (ఆర్కే వన్నార్ చోళ) హెచ్చరించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp