
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ :భారత్తో జరగనున్న టీ20 సిరీస్ (T20 Series) కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (Afghanistan Cricket Board) విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. ఈ వీడియోలో ఉపయోగించిన భారత మ్యాప్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతాలను మన దేశంలో అంతర్భాగంగా చూపించడంపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఐసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆదివారం ఈ ప్రమోషనల్ వీడియోను పంచుకుంది. అందులోని పలు ఫ్రేమ్లలో పీఓకే, గిల్గిత్-బల్టిస్తాన్ ప్రాంతాలు స్పష్టంగా భారత సరిహద్దుల్లో కనిపించాయి. ఈ విషయం పాకిస్తాన్లో తీవ్ర దుమారం రేపుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ వ్యవహారాన్ని వెంటనే తమ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఘటనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేయాలని పీసీబీ భావిస్తోంది. మరోవైపు భారత నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్యాప్లో జూమ్ అవుతున్న కొద్దీ ఆ ప్రాంతం మసకబారుతోందని, ఆ లోపాన్ని కూడా సరిదిద్దాలని కొందరు సోషల్ మీడియా వేదికగా వినతులు చేస్తున్నారు.
భారత్ వేదికగా అఫ్గానిస్తాన్ సిరీస్ భారత్ మరియు అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఈనెల 13 నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. వాస్తవానికి ఈ సిరీస్ను అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా నిర్వహిస్తోంది. కానీ వారి దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, సిరీస్ మొత్తాన్ని భారత్లోనే ఆడేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సిరీస్ ఆరంభానికి ముందే ఈ మ్యాప్ వివాదం తెరపైకి రావడంతో ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



