Skip to content
Home » హైదరాబాద్ రూపురేఖలు మార్చే భారీ బ్లూప్రింట్ సిద్ధం: అసెంబ్లీలో CM Revanth Reddy కీలక ప్రకటన

హైదరాబాద్ రూపురేఖలు మార్చే భారీ బ్లూప్రింట్ సిద్ధం: అసెంబ్లీలో CM Revanth Reddy కీలక ప్రకటన

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని భవిష్యత్తు గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ బ్లూప్రింట్ సిద్ధం చేసిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు, ఇది కేవలం సాధారణ అభివృద్ధి కాదని ప్యూర్ మరియు క్యూర్ మోడల్ తో కాలుష్య రహిత నగర నిర్మాణానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రచిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

నగరంలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఆవలకి తరలించి ఆ స్థలాలను మల్టీ-జోన్ హబ్‌లుగా మార్చడంతో పాటు నగరంలో మెట్రో (Metro) సేవలను మరింత విస్తరించేందుకు రూ.24 వేల కోట్లతో 74 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు, ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచడంపై దృష్టి సారించామని మరియు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు పంజాగుట్ట, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లను జూన్-జూలై నాటికి పూర్తి చేసి సిగ్నల్ ఫ్రీ (Signal Free) నగరంగా మారుస్తామని చెప్పారు.

మూసీ నది (Musi River) ప్రక్షాళనతో పాటు గుజరాత్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ (Sabarmati Riverfront) తరహాలో దీనిని అభివృద్ధి చేసి హైదరాబాద్ కు కొత్త పర్యాటక శోభను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు, ఢిల్లీ (Delhi) కాలుష్యం, ముంబై (Mumbai) వరదలు మరియు బెంగళూరు (Bengaluru) ట్రాఫిక్ సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుచూపుతో అడుగులు వేస్తున్నామని మరియు స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఒక అద్భుతమైన స్మార్ట్ మెగా సిటీగా అవతరించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.