|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే

Hyderabad, Surya News: దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ఒక మంచి శుభవార్త చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 119 సెక్షన్ కంట్రోలర్ (Section Controller) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

​ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే కీలకమైన విభాగం కావడంతో అభ్యర్థుల కంటి చూపుకు సంబంధించి రైల్వే శాఖ అత్యంత కఠిన నిబంధనలను విధించింది. మెడికల్ స్టాండర్డ్స్ (Medical Standards) స్పష్టంగా A-2 కేటగిరీకి సరిపోవాలి. దరఖాస్తుదారులు కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ముఖ్యంగా కంటి చూపు కోసం లాసిక్ (LASIK) సర్జరీ చేయించుకున్న వారు ఈ పోస్టులకు ఏమాత్రం అర్హులు కారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఎంపికైన అభ్యర్థులకు ఏడవ వేతన సంఘం ప్రకారం లెవెల్-6 (Level-6) పే స్కేల్ కింద జీతం అందిస్తారు. ప్రాథమిక వేతనంగా (Initial Pay) నెలకు రూ. 35,400 చెల్లిస్తారు. వివిధ రైల్వే జోన్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్‌లో (Notification PDF) చెక్ చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను మొత్తం నాలుగు దశల్లో ఎంపిక చేయనున్నారు. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆపై మెడికల్ టెస్టులు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 14 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు రైల్వే శాఖ అధికారిక పోర్టల్ https://www.rrbapply.gov.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. పూర్తి నోటిఫికేషన్ పీడీఎఫ్ ఫైల్ కోసం సికింద్రాబాద్ లాంటి రీజనల్ వెబ్‌సైట్లను (rrbsecunderabad.gov.in) సందర్శించవచ్చు. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే ఫేక్ వెబ్‌సైట్లు, ఏజెంట్లు, గుర్తు తెలియని లింకుల పట్ల అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp