బాచుపల్లి పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు, హాజరైన భారీ సంఖ్యలో కార్యకర్తలు

కుత్బుల్లాపూర్, మార్చి 10, 2026 (మన సూర్య న్యూస్):కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య సామరస్యం, ఐక్యతకు మరోసారి అద్దం పట్టిన సంఘటన జరిగింది. 131 డివిజన్ అధ్యక్షులు ఎండి జాకీర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని మర్యాదాపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం హన్మంత్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ రెడ్డి గారు, 131 డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుజాత గారు, సంగీత గారు, శ్రీనివాస్ గారు, NSUI నాయకులు గొల్ల జాన్ గారు, మహిళా నాయకురాలు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపిన తర్వాత అందరూ ఫొటోలు తీయించుకున్నారు. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, గ్రాస్రూట్ స్థాయిలో ఐక్యతకు సంకేతంగా మారింది.