సర్కార్పై ఏబీవీపీ సమరశంఖం: విద్యారంగానికి 15% బడ్జెట్ ఇవ్వాల్సిందే.. లేదంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు!
తెలంగాణ బడ్జెట్లో విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ అల్టిమేటం జారీ చేసింది. సుమారు రూ. 9,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించింది.
