హయత్ నగర్ వీరన్న గుట్ట ఆలయంలో కొప్పుల నర్సింహారెడ్డి ప్రత్యేక పూజలు
హయత్ నగర్ లోని ప్రాచీన వీరన్న గుట్ట ఆలయంలో ఎల్.బి. నగర్ బీజేపీ నేత, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కాంక్షిస్తూ శివలింగానికి అభిషేకాలు చేసి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
