Skip to content

2027 నాటికి ఓఆర్ఆర్ పరిధిలో ‘నెట్ జీరో’ లక్ష్యం: ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్ ORR పరిధిని నెట్ జీరో జోన్‌గా మారుస్తామని, కాలుష్య పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తామని వెల్లడించారు. క్లైమేట్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడంలో గ్రీన్ ఎనర్జీ పాత్రను ఆయన నొక్కి చెప్పారు.

సింగరేణి కార్మికుల గౌరవం పెంచేలా కీలక నిర్ణయం: ‘బదిలీ వర్కర్’ హోదా ఇక గతం

సింగరేణి పర్సనల్ విభాగం జారీ చేసిన అధికారిక సర్క్యులర్.

సింగరేణి కార్మికుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సంస్థలో ఇకపై ‘బదిలీ వర్కర్’ అనే పదం వినిపించదు. ఈ హోదాను ‘జనరల్ అసిస్టెంట్ ట్రెయినీ’గా మారుస్తూ సింగరేణి యాజమాన్యం చారిత్రక ఉత్తర్వులు జారీ చేసింది. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు, కార్మికులకు సామాజికంగా గౌరవప్రదమైన గుర్తింపునిచ్చేలా తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుంది.