Skip to content

కార్పొరేట్ సెలూన్లతో చిన్న వ్యాపారుల జీవనోపాధికి గండి: MLC తీన్మార్ మల్లన్నకు నాయి బ్రాహ్మణుల వినతి!

MLC తీన్మార్ మల్లన్నకు వినతిపత్రం అందజేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు.

హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీకి విస్తరిస్తున్న కార్పొరేట్ సెలూన్ల వల్ల చిన్న చిన్న కటింగ్ షాపుల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ జీవనోపాధిని కాపాడాలని కోరుతూ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు MLC తీన్మార్ మల్లన్నను ఆశ్రయించారు. ప్రభుత్వం స్పందించకపోవడంపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

గజ్వేల్‌లో తీన్మార్ మల్లన్న సెన్సేషన్: భారీగా టీఆర్‌పీలో చేరికలు – బీసీల రాజ్యాధికారమే లక్ష్యం

తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్‌పీ పార్టీలో చేరుతున్న గజ్వేల్ నాయకులు మరియు కార్యకర్తలు

గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. బీసీల అణచివేతకు వ్యతిరేకంగా మరియు రాజ్యాధికార సాధన కోసం గజ్వేల్‌లో త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మల్లన్న వెల్లడించారు.

విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ కదనరంగం: కూకట్‌పల్లిలో అర్ధనగ్న ప్రదర్శన, రాస్తారోకో

ఏబీవీపీ కూకట్‌పల్లి రాస్తారోకో – అర్ధనగ్న ప్రదర్శనతో విద్యారంగ సమస్యలపై నిరసన తెలిపిన కార్యకర్తలు, హైదరాబాద్

ఏబీవీపీ కూకట్‌పల్లిలో అర్ధనగ్న ప్రదర్శన, రాస్తారోకో! ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఫీజు పెంపు ఉపసంహరణ కోరుతూ భారీ నిరసన. ట్రాఫిక్ నిలిచిపోయింది – విద్యారంగ సమస్యలపై ఉద్యమం!

మల్లంపేట్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు : పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ

మల్లంపేట్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ మరియు నాయకులు

మల్లంపేట్‌లో మైనారిటీ సమాజం నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని తెలిపారు.

MLA Disqualification Verdict: దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లు కొట్టివేత: స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోటో మరియు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ల కొట్టివేత చిత్రం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తగిన ఆధారాలు లేవంటూ కొట్టివేశారు.

ఢిల్లీకి తెలంగాణ కేబినెట్: ఆత్మగౌరవ అంశంపై రాజకీయ దుమారం

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం

తెలంగాణ కేబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర ఆత్మగౌరవానికి అవమానమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో రాజకీయ దుమారం రేగింది