అట్టహాసంగా ప్రారంభమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ మహాభియాన్ 2026
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యశాల హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైంది. జాతీయ నేతలు బి.ఎల్. సంతోష్, తరుణ్ చుగ్లతో కలిసి పార్టీ నేత ఎన్. రామచందర్ రావు బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించారు. దక్షిణాదిలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా ఈ శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి.
