పెంజర్లలో పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి బాణసంచా లారీ దహనం – తృటిలో తప్పిన భారీ ప్రాణనష్టం!
రంగారెడ్డి జిల్లాలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొత్తూర్ మండలం పెంజర్లలో బాణసంచా (క్రాకర్స్) లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగులడంతో దహనమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పినా, భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
