TELANGANA : ఏప్రిల్ రెండో వారంలో ‘దోస్త్’ నోటిఫికేషన్: డిగ్రీలో సమూల మార్పులు, భారీగా కొత్త కోర్సులు
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఏప్రిల్ రెండో వారంలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసారి డిగ్రీలో సరికొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది.
