పదోతరగతి పరీక్షల్లో ‘జీరో మొబైల్ జోన్’ : నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు – విద్యాశాఖ సంచలన నిర్ణయం
తెలంగాణలో జరుగుతున్న పదోతరగతి పరీక్షల్లో విద్యాశాఖ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. పరీక్షా కేంద్రాల్లో ‘జీరో మొబైల్ జోన్’ (Zero Mobile Zone) విధానాన్ని ప్రవేశపెట్టింది. మొబైల్ ఫోన్లు వాడితే 1997 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

