Skip to content
Home » Telangana Government : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గాలికొదిలేస్తున్నారా: కఠిన చర్యలతో బుద్ధి చెప్పేలా తెలంగాణ ప్రభుత్వ కొత్త బిల్లు

Telangana Government : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గాలికొదిలేస్తున్నారా: కఠిన చర్యలతో బుద్ధి చెప్పేలా తెలంగాణ ప్రభుత్వ కొత్త బిల్లు

హైదరాబాద్, సూర్య న్యూస్ : వృద్ధాప్యంలో కన్నవారిని గాలికొదిలేసే పిల్లలకు బుద్ధి చెప్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) సంచలన నిర్ణయం తీసుకుంది, తమ భవిష్యత్తు కోసం జీవితాన్ని ధారపోసిన తల్లిదండ్రులను (Parents) పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా పేరెంట్స్ సపోర్ట్ బిల్లుకు (Parents Support Bill) ఆమోదం తెలిపింది.

ఈ నూతన చట్టం ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లల ఆదాయం లేదా నెలవారీ వేతనం (Monthly salary) నుంచి కొంత భాగాన్ని నేరుగా వృద్ధుల బ్యాంక్ ఖాతాల్లో (Bank accounts) జమ చేస్తారు, మానవ సంబంధాలు (Human relations) మసకబారుతున్న ప్రస్తుత రోజుల్లో ఈ నిర్ణయం కేవలం పాలనాపరమైన సంస్కరణ మాత్రమే కాదని ఇదొక గొప్ప నైతిక బాధ్యత అని సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు, పిల్లలు తమ బాధ్యతను విస్మరించినప్పుడు చట్టం (Law) ద్వారా న్యాయం చేయాల్సిన పరిస్థితి రావడం సమాజంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది ఆస్తులు లేదా విలాసాలు కాదని కనీస సమయం మరియు ప్రేమ మాత్రమేనని నిపుణులు గుర్తు చేస్తున్నారు, ప్రేమ పంచాల్సిన చోట కనీస బాధ్యత కరువైనప్పుడు ప్రభుత్వం కలుగజేసుకుని వారికి ఆర్థిక భద్రత కల్పించడం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పలువురు మేధావులు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

ఈ చట్టం అమలుతో వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక స్వావలంబన (Financial independence) లభిస్తుంది, కన్నపిల్లలు పట్టించుకోకపోయినా ఇతరులపై ఆధారపడకుండా తమ మందులు మరియు కనీస అవసరాలను (Basic needs) వారే సొంతంగా తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది, దీనివల్ల అనాథాశ్రమాలు లేదా వృద్ధాశ్రమాలకు (Old age homes) వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు సమాజంలో సీనియర్ సిటిజన్లకు (Senior citizens) భద్రతా భావం పెరుగుతుందని సామాజిక కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.