Skip to content
Home » క్రీడారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వాకిటి శ్రీహరి

క్రీడారంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మరియు తెలంగాణను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు, మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు, 2026-2027 బడ్జెట్‌లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం మరియు ఇతర వసతుల కల్పనపై ఆయన క్షుణ్ణంగా చర్చించారు.

నూతన క్రీడా పాలసీతో ముందుకు:

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న నూతన క్రీడా పాలసీ ద్వారా క్రీడల అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేపట్టాలని భావిస్తోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు, అందులో భాగంగానే క్రీడా శాఖకు ఈ బడ్జెట్‌లో గతంలో కంటే అధిక నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

పతక విజేతలకు భారీ ప్రోత్సాహకాలు:

ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు, విజేతలకు ఇచ్చే పారితోషికాల విషయంలో పారదర్శకమైన విధివిధానాలను రూపొందించాలని సూచించారు, పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

అధికారులకు ఆదేశాలు:

క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలు నిష్పక్షపాతంగా అందేలా చూడాలని అధికారులను మంత్రి కోరారు, ప్రభుత్వం ఇచ్చే చేయూతతోనే విద్యార్థులు మరియు యువకులు క్రీడల్లో రాణించగలరని ఆయన అభిప్రాయపడ్డారు, ఈ సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *