
మేడ్చల్ మల్కాజిగిరి: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యవసర స్థితి (Emergency) నేర్పిన పాఠాలు యువతకు దిక్సూచిగా నిలుస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు. సైనిక్ పురిలోని భవన్స్ వివేకానంద కళాశాల వేదికగా “50 Years of Emergency Lessons for Indian Democracy” అనే అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర
ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న చీకటి రోజులను, ఆ తర్వాత జరిగిన రాజ్యాంగ సంస్కరణలను నేటి తరం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు.

పాల్గొన్న ప్రముఖులు
ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
భవన్స్ వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ జీఎస్వీఆర్కే చౌదరి
రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజినీ ప్రియ
ఎన్ఎస్ఎస్ యూత్ ఆఫీసర్ సైదా
ఆర్టీఏ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి
మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బండి రాజు
బిజెపి పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్
బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి
మాజీ కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డియువత పార్లమెంటరీ విధానాలపై అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని కళాశాల యాజమాన్యం మరియు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



