|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ: దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటన – ట్రంప్ లొంగుబాటు డిమాండ్‌పై పెజెష్కియాన్ ఘాటు స్పందన

టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా గల్ఫ్ దేశాలపై జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులకు సంబంధించి ఆయన ఆయా దేశాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలపై దాడులు చేసే ఉద్దేశం ఇరాన్ కు లేదని, జరిగిన పొరపాట్లపై చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సమన్వయ లోపమే కారణం​

ఇరాన్ ప్రభుత్వ మీడియాలో మాట్లాడిన పెజెష్కియాన్.. పొరుగు దేశాలపై జరిగిన దాడులను “దురదృష్టకరం” అని అభివర్ణించారు. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత సైనిక బలగాల్లో తలెత్తిన సమన్వయ లోపం వల్ల కొన్ని దాడులు జరిగాయని ఆయన వివరించారు. గల్ఫ్ దేశాలన్నీ తమ సోదర దేశాలని, వారితో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

తాత్కాలిక కౌన్సిల్ కీలక నిర్ణయం

​ఇరాన్‌ను ప్రస్తుతం పాలిస్తున్న తాత్కాలిక నాయకత్వ కౌన్సిల్ శుక్రవారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పొరుగు దేశాలపై ఎటువంటి దాడులు చేయకూడదని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, పొరుగు దేశాల భూభాగాల నుంచి ఇరాన్ పై దాడులు జరిగితే మాత్రం వాటిని తిప్పికొట్టే హక్కు తమకు ఉందని కౌన్సిల్ తేల్చి చెప్పింది.

ట్రంప్ డిమాండ్ పై ఘాటు స్పందన​

ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న ట్రంప్ డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. “ఇరాన్‌ను లొంగదీసుకోవాలని అమెరికా కంటున్న కలలు ఎప్పటికీ నెరవేరవు. ఆ కలలను వారు సమాధి చేసుకోవాల్సిందే” అని పెజెష్కియాన్ హెచ్చరించారు. యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు తాము శాంతి వైపు అడుగులు వేస్తున్నామే తప్ప, భయపడి కాదని ఆయన స్పష్టం చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp