
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం రెండవ వారానికి చేరుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి, బ్యారెల్ చమురు ధర 100 డాలర్ల మార్క్ దాటడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
హర్మూజ్ జలసంధి మూసివేత హెచ్చరికలతో భయంకీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరికలతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి, డబ్ల్యూటీఐ (WTI) చమురు ధర 106-118 డాలర్లకు చేరుకోగా బ్రెంట్ (Brent) క్రూడ్ ధర 107-119 డాలర్లకు చేరింది, కేవలం గత వారం రోజుల్లోనే ధరలు 26 నుండి 36 శాతం మేర పెరగడం గమనార్హం, ఇది గత మూడున్నర ఏళ్లలో గరిష్ట స్థాయి, ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతున్న నేపథ్యంలో ఈ మూసివేత భారీ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తీవ్రస్థాయికి చేరిన దాడులు
ఈ యుద్ధం ఫిబ్రవరి 27న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ప్రారంభమైంది, అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట, ఇజ్రాయెల్ ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట రంగంలోకి దిగాయి, ఫిబ్రవరి 28 ఉదయం 9:45 గంటలకు ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు ఇస్ఫహాన్, కోమ్ నగరాల్లోని కీలక స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి, ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కాంపౌండ్, ఇతర కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి, దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4 పేరిట క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది.
జూన్ 2025 నుంచే ఉద్రిక్తతలు
గత ఏడాది జూన్ 2025లో ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయడం, దానికి ప్రతీకారంగా ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి, ఇప్పుడు అవి పూర్తిస్థాయి యుద్ధంగా మారి రెండవ వారానికి చేరుకోవడంతో చమురు సంక్షోభం తీవ్రమైంది.
భారత్, తెలంగాణపై పడనున్న పెను ప్రభావంఈ అంతర్జాతీయ పరిణామాలతో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 10 నుంచి 20 రూపాయల మేర పెరిగే ప్రమాదం పొంచి ఉంది, దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం 7 నుంచి 8 శాతానికి చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు, కువైట్, యూఏఈల నుంచి ఎగుమతులు తగ్గితే భారత్ కు దిగుమతుల కష్టాలు తప్పవు, రానున్న రోజుల్లో బ్యారెల్ చమురు ధర 120 నుంచి 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు, ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర 110 నుంచి 120 రూపాయలకు చేరే అవకాశం ఉంది, అయితే సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం ఏమైనా సబ్సిడీలు ప్రకటిస్తుందా అనేది వేచి చూడాలి.