Skip to content
Home » ​MLA KP Vivekanand : జనం మధ్యకు వెళ్లిన ఎమ్మెల్యే వివేకానంద్.. కాలనీలో ఏం జరిగిందంటే?

​MLA KP Vivekanand : జనం మధ్యకు వెళ్లిన ఎమ్మెల్యే వివేకానంద్.. కాలనీలో ఏం జరిగిందంటే?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట డివిజన్ వాంబే హౌస్ కాలనీలో (Vambay House Colony) మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతామని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ (MLA KP Vivekanand) స్పష్టం చేశారు. గురువారం అధికారులతో కలిసి ఆయన కాలనీలో క్షేత్రస్థాయి పర్యటన (Field Visit) నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

కాలనీలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీ (Underground Drainage), త్రాగునీటి సరఫరా (Drinking Water Supply) సామర్థ్యాన్ని పెంపొందించాలని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అదేవిధంగా నూతన వీధి దీపాలు (Street Lights) ఏర్పాటు చేయడంతో పాటు అంతర్గత సిసి రోడ్ల (CC Roads) నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.. ఇప్పటికే కాలనీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న రోజుల్లో మౌలిక వసతులను మరింత ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో వాంబే హౌస్ కాలనీ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి మౌనిక, మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు బాబు గౌడ్, పాపులు గౌడ్, విటల్, దాసు, మల్లేష్ గౌడ్, శశిధర్ ముదిరాజ్, ప్రభాకర్, మెట్ల శీను, సాయి తేజ, గోపాల్, మహేందర్, నాని, ముంతాజ్, అంజి, భూపతి రెడ్డి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.