|   
🔴 BREAKING NEWS ► Pawan Kalyan Letter : సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంచలన లేఖ.. Telangana Voter List : తెలంగాణలో ఓటర్ల నమోదు, సవరణ SIR ప్రక్రియ గడువు పొడిగింపు.. ఈసీ తాజా ఉత్తర్వులు! Palamuru University Guest Faculty Recruitment : పాలమూరు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి ఇలా! Akhil Akkineni Movie Hit : అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మూవీ సక్సెస్.. తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఎమోషనల్! Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Skip to content

Telangana Voter List : తెలంగాణలో ఓటర్ల నమోదు, సవరణ SIR ప్రక్రియ గడువు పొడిగింపు.. ఈసీ తాజా ఉత్తర్వులు!

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఓటర్ల వివరాల నమోదు మరియు సవరణలకు సంబంధించిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు ఆగస్టు 3 వరకు ఈ గడువును పెంచుతూ ఎన్నికల సంఘం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల నమోదు, అలాగే సవరణల ఫారాల పంపిణీ మరియు సేకరణ కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరుగుతుందని తొలుత ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ గడువును పొడిగించాలని ప్రభుత్వం నుంచి వినతులు రావడంతో ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎస్ఐఆర్ (SIR) గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఈ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలను కూడా ఎన్నికల సంఘం తొలగించింది. ఫారం నింపకపోయినా, లేదా నింపిన ఫారం ఇవ్వకపోయినా సరే ఓటరు జాబితాలో (Voter List) ఓటు హక్కు సురక్షితంగా ఉంటుందని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటరు గణన ఫారంలో పలు కీలక వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. జనన సంవత్సరం ఆధారంగా ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు కుటుంబ సభ్యుల ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (Voter ID) నంబర్, నియోజకవర్గం, భాగం సంఖ్య, మరియు ఓటరు క్రమ సంఖ్య వంటి వివరాలను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంది.

ముఖ్యంగా వివాహానికి ముందు, ఆ తర్వాత రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు అందులో ఒకదానిని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వివరాల నమోదులో ఏవైనా పొరపాట్లు జరిగితే తమ ఓటు ఎక్కడ తొలగిపోతుందోననే భయంతో ప్రజలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని చదువుకున్న ఓటర్లు కూడా దరఖాస్తులు నింపడంలో సందిగ్ధానికి గురవుతున్నారు. ఈ గడువు పొడిగింపుతో ఓటర్లకు తమ వివరాలను నిదానంగా సరిచూసుకునేందుకు మరింత సమయం లభించినట్లు అయింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp