
హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి (CM Revanth Reddy) గారిని ఆయన నివాసంలో కాంగ్రెస్ నేత డాక్టర్ కోటూరి మానవతారాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటికి వెళ్లి తన మేనకోడలి పెండ్లి పత్రికను అందజేశారు. ఈ నెల 16 వ తేదీ ఉదయం 11-55 గంటలకు హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతమైన నారపల్లిలోని కొర్రెముల రోడ్ లో గల వెంకటాద్రి టౌన్ షిప్ లో ఈ వివాహ వేడుక జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఛీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (Chief Technical Officer) యాదగిరి రామకృష్ణ మరియు మాధురి దంపతుల కుమార్తె నందిని వివాహాన్ని ఐతగోని సాంబయ్య మరియు మంగల కుమారుడు రవితేజ గౌడ్ తో నిశ్చయించారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి విచ్చేయాలని ముఖ్యమంత్రిని కోటూరి మానవతారాయ్ కోరారు.
డాక్టర్ కోటూరి మానవతారాయ్ (Dr Koturi Manavatha Roy) ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో నిరుద్యోగ జేఏసీ (Nirudyoga JAC) చైర్మన్ గా నిరుద్యోగుల హక్కుల కోసం ఆయన పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం అనేక ఉద్యమాలు నడిపించిన వ్యక్తిగా ఆయనకు యువతలో మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు.
తన మేనకోడలి వివాహ వేడుకకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మానవతారాయ్ ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పత్రికను స్వీకరించి వివాహ వేడుక వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పెళ్లికి పలువురు రాజకీయ ప్రముఖులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




