|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

Aston Martin Hit And Run Case : హైదరాబాద్‌లో లగ్జరీ కారు బీభత్సం.. యువతి ప్రాణం తీసిన ఎంపీ కొడుకు? సీసీటీవీ దృశ్యాలు మాయం!

hyderabad-luxury-car-accident-cctv-missing.png
hyderabad-luxury-car-accident-cctv-missing

హైదరాబాద్, సూర్య న్యూస్: ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్ పరిధిలో అత్యంత ఖరీదైన లగ్జరీ కారు అస్టన్ మార్టిన్ (Aston Martin Car) సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల భారతి ముఖి (Bharati Mukhi) అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ప్రముఖ రాజకీయ ప్రముఖుడి కుమారుడు సంజుష్ లింగమనేని (Sanjush Lingamaneni) అతివేగంగా నడిపినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒడిశా రాష్ట్రం నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన భారతి ముఖి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అమిత వేగంతో దూసుకొచ్చిన లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం అనంతరం అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్‌ను స్థానికులు అడ్డుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించేలా ఒత్తిడి చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

​ఈ ఘటన జరిగి పలు రోజులు గడుస్తున్నా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. ప్రధాన రహదారిపై వందలాది సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ ప్రమాద దృశ్యాలు లభ్యం కాకపోవడం, కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం, పలుకుబడి ఉన్నవారికి మరో న్యాయమా అంటూ నెటిజన్లు, ప్రజాసంఘాలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp