
హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్లోని ఖాజాగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం (హిట్ అండ్ రన్) కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి కారణమైన అనంతరం పరారీలో ఉన్న అతడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నందూలాల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఆయన గాయపడ్డారు. అదే సమయంలో అక్కడే ఉన్న జైద్ షా అనే వ్యక్తి స్పందించి, గాయపడిన నందూలాల్ను తన కారులో ఎక్కిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.
సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన సందీప్ కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందూలాల్ మృతి చెందగా, జైద్ షా సైతం గాయాలపాలయ్యారు.
సీసీటీవీ ఫుటేజీతో దొరికిపోయిన నిందితుడు
ప్రమాదం జరిగిన వెంటనే సందీప్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పక్కా ఆధారాలతో సందీప్ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



