
హైదరాబాద్, సూర్య న్యూస్ : ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు ఏకంగా ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కీసర సబ్ ఇన్స్పెక్టర్ (Keesara SI) జ్ఞానేందర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కీసర చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న ఆయన తన కారులో ఈ లంచం మొత్తాన్ని స్వీకరించారు.
స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ మొదట పది లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడితో బేరసారాల అనంతరం చివరికి ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ముందుగానే అందుకున్న అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎస్ఐ కారులో డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే నేరుగా పట్టుకున్నారు. ఆయన వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ అవినీతి వ్యవహారంలో కీసర ఇన్ స్పెక్టర్ ఆర్యపల్లి ఆంజనేయులు పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా అధికారులు దృష్టి సారించి లోతైన విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భారీ లంచం బాగోతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



