
హైదరాబాద్, సూర్య న్యూస్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana Konidela) దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని తమ నివాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తమ గారాల పట్టి క్లింకారతో (Klin Kaara) పాటు కుటుంబంలోని ఇతర పిల్లలతో కలిసి వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అందంగా ముస్తాబు చేసి దేవుడి గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఓ క్యూట్ ఫోటోను ఉపాసన తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫోటోను షేర్ చేసిన ఉపాసన.. “నా కల నెరవేరింది. ఓం నమో భగవతే వాసుదేవాయ” అంటూ రాసుకొచ్చారు. రామ్ చరణ్ దంపతులు దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మెగా అభిమానులు ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ను తెగ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



