|  
FLASH NEWS
AP Liquor Policy : మద్యం ప్రియులు, వ్యాపారులకు బిగ్ అలర్ట్.. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్మితే రూ.10 లక్షల ఫైన్!  •  TGPSC Notification Cancelled : నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ 544 పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ కీలక ప్రకటన!  •  Modi Gifts Putin : రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతి.. పుతిన్‌ను ఆకర్షించిన ఆ అరుదైన పుస్తకం ఏమిటంటే?  •  Jio Network Issue : సిగ్నల్ రావడం లేదని వినూత్న నిరసన.. టెలికాం ఉద్యోగిని ఏకంగా టవర్‌కే కట్టేసిన గ్రామస్తులు!  •  KTR Comments on Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ వెనుక మంచిరేవుల భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు  • 
Skip to content

AP Employees DA : ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఒకేసారి రెండు డీఏల విడుదలకు ఉత్తర్వులు!

అమరావతి, సూర్య న్యూస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees), పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రెండు కరువు భత్యాల (Dearness Allowance) విడుదలకు సంబంధించి తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ డీఏలు ఈ సెప్టెంబర్ నెల వేతనం నుంచే అమలు కానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. 2.73 శాతం డీఏను 2024 జులై 1వ తేదీ నుంచి లెక్కగట్టి చెల్లించనున్నారు. దీనికి సంబంధించిన 26 నెలల బకాయిలను 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో విడతల వారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే మరో 1.82 శాతం డీఏను 2025 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ డీఏకు సంబంధించిన 20 నెలల బకాయిలను 2028వ సంవత్సరం జనవరి, మార్చి, మే, జులై నెలల్లో చెల్లించనున్నట్లు తాజా ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకేసారి రెండు డీఏలు మంజూరు కావడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp