కాలిఫోర్నియా : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) మొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరతీస్తోంది. ఇటీవల తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డుయో (iPhone Duo) ను లాంచ్ చేసిన ఈ సంస్థ.. భవిష్యత్తులో మరిన్ని మడత ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న మోడల్ కు కొనసాగింపుగా డుయో మ్యాక్స్ పేరుతో తదుపరి వెర్షన్ ను లాంచ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే సామాన్య వినియోగదారులను కూడా ఆకర్షించే ఉద్దేశ్యంతో ఇంకాస్త తక్కువ ధరలో డుయో ఎస్ఈ, మినీ అనే పేర్లతో సరికొత్త ఫోల్డబుల్ మోడల్స్ తీసుకువచ్చే అంశాన్ని కంపెనీ తీవ్రంగా పరిశీలిస్తోంది.
ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్స్ విభాగంలో శాంసంగ్, గూగుల్ కంపెనీలు భారీ మోడల్స్ తో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మడత ఫోన్ల మార్కెట్ వాటాను పూర్తిగా కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా యాపిల్ ఈ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసినట్లు టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



