
హైదరాబాద్, సూర్య న్యూస్: టాలీవుడ్ ప్రముఖ కథానాయిక నిధి అగర్వాల్ (Heroine Nidhhi Agerwal) చుట్టూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వివాదం ముదిరింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్ల ప్రమోషన్ల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate – ED) హైదరాబాద్లోని తన ప్రాంతీయ కార్యాలయంలో ఆమెను సుదీర్ఘంగా విచారించింది.
ప్రముఖ బెట్టింగ్ యాప్ ‘జీత్ విన్’ (JeetWin) సహా పలు వివాదాస్పద గేమింగ్ ప్లాట్ఫారమ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం, ప్రమోషనల్ యాడ్స్లో నటించడంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ప్రచారాల కోసం యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు, అందుకుగాను ఆమె అందుకున్న భారీ రెమ్యునరేషన్ లావాదేవీలు, నిధుల బదిలీ మార్గాలపై ఈడీ అధికారులు లోతుగా వివరాలు సేకరించారు.
దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణ అనంతరం ఆమె కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అక్కడ వేచి ఉన్న మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిరాకరిస్తూ ఆమె నేరుగా కారులో వెళ్లిపోయారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను బాధ్యతారాహిత్యంగా ప్రమోట్ చేస్తున్న సినీ ప్రముఖులపై దర్యాప్తు సంస్థలు కొరడా ఝుళిపిస్తున్న క్రమంలో నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరుకావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



