Skip to content
Home » ప్రపంచ ఏఐ కేంద్రంగా తెలంగాణ: అమెరికా పెట్టుబడిదారులకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

ప్రపంచ ఏఐ కేంద్రంగా తెలంగాణ: అమెరికా పెట్టుబడిదారులకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

​న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (AI) రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు వేదికగా మారుతోందని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దేశ రాజధానిలో జరిగిన ప్రతిష్టాత్మక “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026”లో భాగంగా అమెరికా-ఇండియా వాణిజ్య మండలి (USIBC) ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో ఉన్న అత్యున్నత టెక్నాలజీ ఎకోసిస్టం అమెరికా పెట్టుబడిదారులకు అనేక నూతన అవకాశాలను కల్పిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.​

అమెరికా టెక్ దిగ్గజాలతో భాగస్వామ్యంతెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమెరికా టెక్ దిగ్గజాలతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు మరియు ముందుచూపుతో కూడిన స్థిరమైన విధానాలు ఏఐ పరిశోధనలకు ఆలంబనగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం వ్యవసాయం విద్య మరియు పట్టణాభివృద్ధి వంటి రంగాలలో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచేలా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టామని మంత్రి అన్నారు.​

ఏఐ యూనివర్సిటీ మరియు హబ్ ల ఏర్పాటువేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ ప్రపంచంతో పోటీ పడేందుకు ఏఐ యూనివర్సిటీ మరియు ఏఐ హబ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతిభావంతులైన స్కిల్ ఫోర్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో ఈ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాసేవలపై రియల్ టైం పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధను విస్తృతంగా వినియోగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *