|   
🔴 BREAKING NEWS ► PM Modi Latest Video : మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. Supreme Court Guidelines : కోర్టు వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు Police Job Aspirant Arrested : నిరుద్యోగుల బంద్ ఎఫెక్ట్.. హాస్టల్ వద్దే పోలీస్ అభ్యర్థి నవీన్ పట్నాయక్ అరెస్ట్ Delhi Police Warning : ఆందోళనకారులకు ఢిల్లీ పోలీసుల సంచలన వార్నింగ్.. ఆ తప్పు చేశారో ఇక మీ పాస్‌పోర్ట్ రద్దే Nandamuri Balakrishna Knee Surgery : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య మోకాలి ఆపరేషన్ సక్సెస్
Skip to content

ప్రగతినగర్ భారీ అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేజీఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో ఉన్న ఫర్నిచర్ షాపుల్లో రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫర్నిచర్ యూనిట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఘటనా స్థలికి బీఆర్ఎస్ శ్రేణులు

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో సర్వం కోల్పోయిన వ్యాపారులను కలిసి వారు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ పరామర్శించిన వారిలో మాజీ డెప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రవికిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కష్టకాలంలో బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. అధికారులు తక్షణమే స్పందించి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp