
Hyderabad, Surya News: ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) న్యాయశాస్త్ర విభాగం విద్యార్థుల కోసం కీలక ఫలితాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్ఎల్బీ (LLB Results), బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ కోర్సులకు సంబంధించిన రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను అధికారులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
జూన్/జూలై 2026లో నిర్వహించిన ఎల్ఎల్బీ 3-వైడీసీ, ఎల్ఎల్బీ ఆనర్స్ 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్ తో పాటు 1 నుంచి 6 సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులైన బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ 2, 4, 6, 8, 10 సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1 నుంచి 10 సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఆగస్టు 29 నుంచి సంబంధిత కళాశాలల్లో పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఫలితాల పునఃపరిశీలన (రీవాల్యుయేషన్) కోసం విద్యార్థులు టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పేపర్కు రూ. 700 ఫీజుతో పాటు ఆన్లైన్ ఛార్జీలు రూ. 15 చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 31 కాగా, రూ. 200 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 3 వరకు గడువు ఇచ్చారు.
ఆన్సర్ స్క్రిప్ట్ ఫోటోకాపీ పొందాలనుకునే విద్యార్థులు పేపర్కు రూ. 1,000 చొప్పున కోర్ బ్యాంకింగ్ పే-ఇన్-స్లిప్ ద్వారా ఫీజు చెల్లించి, ప్రిన్సిపాల్ అటెస్టేషన్ మరియు అవసరమైన పత్రాలతో ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో నేరుగా సమర్పించాలి. ఫోటోకాపీ దరఖాస్తులు ఆగస్టు 20 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు స్వీకరించబడతాయి. పూర్తి ఫలితాల వివరాల కోసం www.osmania.ac.in వెబ్సైట్ను చూడవచ్చు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



