|  
FLASH NEWS
Tollywood Director Arrest : పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్… చంచల్‌గూడ జైలుకు తరలింపు  •  TOXIC Movie Review : ‘కేజీఎఫ్’ స్థాయి మ్యాజిక్ రిపీట్ అయిందా? యశ్ ‘టాక్సిక్’ సినిమా అసలు కథ మరియు పబ్లిక్ టాక్ ఇదే  •  Suryapet Road Accident : సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. నిద్రమత్తులో ఉండగానే ఆరుగురు బలి!  •  సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  • 
Skip to content

PM Modi : నేపాల్‌లో భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్… ఆపద్బాంధవుడిగా రంగంలోకి భారత్, కైలాస యాత్రికుల పరిస్థితి ఏంటి?

nepal-flash-floods-india-aid-kailash-pilgrims-suryanews.jpg
nepal-flash-floods-india-aid-kailash-pilgrims

ఖాట్మండు, సూర్య న్యూస్: నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. భోటే కోషి నదిలో (Bhote Koshi River) బుధవారం ఉదయం ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా రసువా జిల్లా (Rasuwa District) పూర్తిగా అతలాకుతలమైంది. టిబెట్ వైపు నుంచి మట్టి, రాళ్లు, మంచు కొండచరియలు విరిగిపడి నదిలోకి దూసుకురావడంతో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ అధికారులు నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో అనేక గ్రామాలు బురదలో కూరుకుపోయాయి. వరద ఉధృతికి 19 వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రోడ్లు, 14 హైడ్రోపవర్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. చైనా సరిహద్దు చెక్‌పోస్ట్‌లను అధికారులు మూసివేశారు. నేపాల్ ఆర్మీ, పోలీసులు, హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

గల్లంతైన వారిలో అత్యధికంగా కైలాస మానసరోవర్ యాత్రికులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమిక లెక్కల ప్రకారం మొత్తం 384 మంది ప్రయాణికులు సంప్రదింపుల్లో లేరు. వీరిలో సుమారు 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. రసువాగఢి చెక్‌పోస్ట్ ద్వారా వీరంతా టిబెట్‌కు వెళ్తున్న సమయంలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో వీరికి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

​ఈ విపత్తుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఆయన ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్ని రకాల మానవతా సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

భారత వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం టెంట్లు, బ్లాంకెట్లు వంటి రిలీఫ్ మెటీరియల్‌తో ఈరోజు సాయంత్రం నేపాల్‌కు బయలుదేరేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం సీ-17 విమానం ద్వారా మరిన్ని సామగ్రిని పంపనున్నారు. విపత్తు నిర్వహణ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఎంబసీ హెల్ప్‌లైన్‌ల ద్వారా సహాయక చర్యలు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp