
Hyderabad, Surya News: తెలంగాణ పోలీసు (Telangana Police) శాఖలో భారీ ఎత్తున ప్రమోషన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు (CIs) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSPs) గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్స్ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కీలక యూనిట్లలో నూతన డీఎస్పీల నియామకం జరిగింది.
ఈ ప్రమోషన్లలో (Promotions) డీఎస్పీలుగా నియామకం అయిన అధికారులు లా అండ్ ఆర్డర్ (Law and Order), ట్రాఫిక్ విభాగాలతో పాటు ఇతర ముఖ్యమైన విభాగాల్లో తమ సేవలను అందించనున్నారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులను డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ప్రత్యేకంగా అభినందించారు. పదోన్నతి అంటే కేవలం హోదా మాత్రమే కాదని గుర్తు చేశారు. ప్రమోషన్ తో పాటు బాధ్యత కూడా మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!
తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.
📲 Join WhatsApp Channelనిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజల సమస్యలను పారదర్శకంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని డీజీపీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ (Crime Control), బాధితులకు సత్వర న్యాయం అందించే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సమర్థవంతమైన నాయకత్వం ప్రదర్శించాలని అధికారులకు పిలుపునిచ్చారు.





