
హైదరాబాద్, సూర్య న్యూస్: ఓస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం మరియు ఓస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ ఫౌండేషన్ (OUCF) సంయుక్త ఆధ్వర్యంలో రేపు ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ప్రముఖ రచయిత వెనపల్లి భాస్కరరావు రాసిన ఆత్మకథ “ది కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్” (The Chemistry of Life) ను శుక్రవారం ఉదయం 10:30 గంటలకు యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగంలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఓస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ కుమార్ మలుగరం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
స్పూర్తిదాయక ప్రస్థానం
“ది కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్” పుస్తకం ఒక శాస్త్రవేత్త సామాన్య స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరును వివరిస్తుంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఓయూ పూర్వ విద్యార్థి తన కెరీర్లో ఎదురైన సవాళ్లను అధిగమించి, ఒక గొప్ప పరిశ్రమను ఎలా స్థాపించారనే అంశాలను ఈ పుస్తకంలో ఆసక్తికరంగా పొందుపరిచారు. ముఖ్యంగా హైదరాబాద్లోని బయో-కెమికల్ మరియు ఫార్మాస్యూటికల్ (ఔషధ) రంగాలు సాధించిన వృద్ధిని ఈ ఆత్మకథ కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది.
ఈ ఆవిష్కరణ సభలో గౌరవ అతిథులుగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి, శాంత బయోటెక్నిక్స్ చైర్ పర్సన్ పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ దర్శకులు బొంగో నర్సింగ్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.పి. ఆచార్య తదితర ప్రముఖులు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓయూ కెమిస్ట్రీ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎం. విజ్జులత కోరారు.