Skip to content
Home » విజయ్-రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

విజయ్-రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన వధూవరులను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి నేరుగా విజయ్ దేవరకొండ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు పూలబొకే అందజేసి ఆశీర్వదించిన సీఎం, అనంతరం విజయ్ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు సరదాగా గడిపారు.

ముఖ్యమంత్రి రాకపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తమ ఇంటికి వచ్చి ఆశీర్వదించినందుకు ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఫోటోలను షేర్ చేశారు. అంతకుముందు రష్మిక మందన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిసి తమ వివాహ వేడుకకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2018లో ‘గీత గోవిందం’ చిత్రంతో తొలిసారి వెండితెరపై జంటగా కనిపించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2019లో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ కలిసి నటించిన ఈ జంట, అప్పటి నుండి స్నేహంగా ఉంటూ చివరకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం సీఎం పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *