|   
🔴 BREAKING NEWS ► Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ల రికార్డ్, ఖాతాలో మరో రెండు స్వర్ణాలు BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే
Skip to content

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీకి అనుకూలంగా వాడుకోవడమేనని ఆయన మండిపడ్డారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ట్విట్టర్ (X) వేదికగా ఘాటుగా స్పందించారు.

ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి, మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయడమేనని కేటీఆర్ విమర్శించారు. స్పీకర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

తెలంగాణ ప్రజలు ఈ అప్రజాస్వామిక చర్యలను గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై తమ పోరాటం ఆగదని, న్యాయస్థానాల్లో దీనిపై తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp