|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

Congress Shock : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్ గూటికి జీవన్ రెడ్డి! ‘అన్నా.. దేవుడే నన్ను పంపాడు’ అంటూ భావోద్వేగం!

సిద్దిపేట/హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన ఉద్ధండ పిండం, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) అధికార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తో భేటీ అయిన ఆయన, కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జీవన్ రెడ్డి అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. మీతో కలిసి పని చేయమని దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు” అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

రేవంత్ రెడ్డి తీరుపై అసహనం:

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. “రాష్ట్రంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మార్క్ ఎక్కడా కనిపించడం లేదు, కేవలం రేవంత్ హవా మాత్రమే నడుస్తోంది. పార్టీలో ఊపిరి ఆడక, ఆత్మగౌరవం దెబ్బతిన్నందునే బయటకు వస్తున్నా” అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇప్పుడు కుదేలైందని, అందుకే తెలంగాణ హితం కోసం మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఎర్రవల్లిలో ఆత్మీయ ఆలింగనం:

జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ స్వయంగా శాలువా కప్పి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరు సీనియర్ నేతలు కాసేపు ఏకాంతంగా చర్చించుకున్న అనంతరం, కేసీఆర్ తో కలిసి జీవన్ రెడ్డి భోజనం చేశారు. జగిత్యాలలో త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, వేలాది మంది కార్యకర్తలతో కలిసి అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

​సూర్య న్యూస్ విశ్లేషణ: జగిత్యాల కోటలో మారుతున్న సమీకరణాలు

1. జీవన్ రెడ్డి అనుభవం – బీఆర్ఎస్‌కు ప్లస్:

జీవన్ రెడ్డి కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఒక విజ్ఞాన సర్వస్వం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన చేరికతో బీఆర్ఎస్‌కు అసెంబ్లీలోనూ, బయట కూడా గట్టి గొంతుక దొరికినట్లయింది. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై ఆయనకున్న పట్టు పార్టీకి పెద్ద అసెట్.

2. జగిత్యాల క్యాడర్ డైలమా:

జీవన్ రెడ్డి నిర్ణయంతో జగిత్యాలలోని కాంగ్రెస్ క్యాడర్ రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. ఆయన వెంటే నడిచే విధేయులు బీఆర్ఎస్‌లోకి వెళ్తుండగా, పార్టీని నమ్ముకున్న కొందరు అయోమయంలో ఉన్నారు. అయితే, జీవన్ రెడ్డి వ్యక్తిగత చరిష్మా జగిత్యాలలో బీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చే అవకాశం ఉంది.

3. కాంగ్రెస్‌కు రాజకీయ నష్టం:

ఒక సీనియర్ ఎమ్మెల్సీ హోదాలో ఉండి, సొంత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షంలోకి వెళ్లడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నైతిక దెబ్బ. ఇది ఇతర అసంతృప్త నేతలకు కూడా దారి చూపే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటోందనే సంకేతాన్ని ఈ భేటీ బలంగా పంపింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp