
వియత్నాం, సూర్య న్యూస్ డెస్క్ : మిస్ వరల్డ్-2026 (Miss World 2026) కిరీటం డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహీరీ మోలా డొమింగెజ్కు దక్కింది. వియత్నాంలోని న్యా ట్రాంగ్లో శనివారం జరిగిన 73వ ఎడిషన్ ఫైనల్లో మాజీ మిస్ వరల్డ్, థాయ్లాండ్కు చెందిన సుచాతా చువాంగ్స్రీ ఆమెకు కిరీటం అందించారు. భారత్ తరఫున పాల్గొన్న నికితా పోర్వాల్ టాప్-40 రౌండ్ వరకు చేరుకుని, టాప్-20లోకి వెళ్లలేకపోయారు.
స్పెయిన్కు చెందిన ఎలిజబెత్ రెయినెస్ ఫస్ట్ రన్నరప్గా, మలేషియాకు చెందిన టానూసియా చెట్టి సెకండ్ రన్నరప్గా నిలిచారు. టానూసియా బ్యూటీ విత్ ఎ పర్పస్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఫైనల్ ఆరుగురిలో డొమినికన్ రిపబ్లిక్, స్పెయిన్, మలేషియాతో పాటు వియత్నాం, దక్షిణాఫ్రికా, ఎరిట్రియా ప్రతినిధులు ఉన్నారు.
24 ఏళ్ల జోహీరీ మోలా టీచర్, మోడల్, వార్తా కరస్పాండెంట్. వ్యాపార నిర్వహణలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందించే కార్యక్రమంపై పనిచేస్తున్నారు. డొమినికన్ రిపబ్లిక్కు ఇది రెండో మిస్ వరల్డ్ కిరీటం. దేశం తరఫున చివరిసారి 1982లో మారియాసెలా అల్వారెజ్ గెలిచారు. తర్వాతి ఎడిషన్ 2027 సెప్టెంబర్లో టాంజానియాలో జరగనుంది
నికితా పోర్వాల్ జర్నీ
ఉజ్జయిని స్వస్థలం నికితా పోర్వాల్ 2024లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచి భారత్కు ప్రాతినిధ్యం వహించారు. థియేటర్ నేపథ్యం ఉన్న ఆమె టాప్-40లో చోటు దక్కించుకున్నారు. మిస్ ఇండియా సంస్థ తరఫున ఆమె ప్రయాణం టాప్-40 వద్ద ముగిసిందని, మిస్ వరల్డ్లో భారత్ వరుస ఎడిషన్లలో ప్లేస్మెంట్ కొనసాగిందని తెలిపారు. ఫైనల్ వేదికపై ఆమె హోస్ట్ దేశ సాంప్రదాయ ఆవో దాయి దుస్తుల్లో కూడా కనిపించారు.

ప్రపంచం నుంచి 110కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ పోటీలో టాప్-40 తర్వాత టాప్-20, టాప్-12, టాప్-6 దశలు జరిగాయి. భారత్ చివరిసారి మిస్ వరల్డ్ కిరీటం 2017లో మనుషి ఛిల్లర్ గెలుచుకున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



