|   
🔴 BREAKING NEWS ► Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ల రికార్డ్, ఖాతాలో మరో రెండు స్వర్ణాలు BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే
Skip to content

గ్రామాల ‘జీవనాడి’ VRAలు రోడ్డున పడ్డారు! మల్లన్న హెచ్చరిక: ‘ఉద్యోగాలు ఇవ్వండి.. లేకపోతే పోరాటం తీవ్రం!

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో మిగిలిన 3,797 మంది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA)కు జీఓ నంబర్లు 81 మరియు 85 ప్రకారం ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కొనసాగుతోంది. ఈ ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు.

పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి ధర్నా స్థలానికి వచ్చిన మల్లన్న, VRAలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “వేలాది కుటుంబాలు ఉద్యోగ భద్రత కోసం పోరాడుతుండగా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఇందిరా పార్క్‌లో జరుగుతున్న అనేక ధర్నాల్లో వెనుకబడిన వర్గాల వారే ఉండటం వల్లనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా?” అని ప్రశ్నించారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

మిగిలిన 3,797 మంది VRAలను రెగ్యులరైజ్ చేసి నియామక పత్రాలు ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద పని కాదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పరిపాలనలో VRAల పాత్ర అత్యంత ముఖ్యమని గుర్తుచేస్తూ, ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ గ్రామాల్లో భూముల వివరాలు తెలుసుకోవాలంటే VRAల అవగాహనే కీలకమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న వీరిని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి VRAలకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమస్య పరిష్కారానికి ఏమైనా అడ్డంకులు ఉంటే స్పష్టంగా చెప్పాలని సూచించారు. గత ప్రభుత్వంలాగే ఇప్పుడు కూడా సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు.

VRAల పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మల్లన్న స్పష్టం చేశారు. “మీ ఉద్యోగాలు వచ్చే వరకు నేను మీతోనే ఉంటాను. మీ బాధ నా బాధ. న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని ప్రకటించారు.

గతంలో ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో భూముల సమస్యపై ఇచ్చిన హామీని నెరవేర్చినట్లే, VRAలకు కూడా న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపారు. అవసరమైతే ఎంతవరకైనా వెళ్తానని, వెనక్కి తగ్గబోనని ఉద్ఘాటించారు.ఉద్యోగాల కోసం పోరాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న VRA కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో పాల్గొన్న VRAలు ప్లకార్డులు, బ్యానర్లతో తమ డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న వీరికి తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ బలపడుతోంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp