|   
🔴 BREAKING NEWS ► Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో
Skip to content

Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్

​న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : పాకిస్తాన్ (Pakistan) మరియు పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ (Afghanistan) మధ్య గత కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా అఫ్గానిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ భీకర వైమానిక దాడులకు (Airstrikes) పాల్పడింది. ఈ దాడులలో 36 మంది అఫ్గాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అఫ్గానిస్తాన్ కేంద్రంగా తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు తమ దేశంపై దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ కారణంతోనే పాకిస్తాన్ సైన్యం సరిహద్దులు దాటి ఈ వైమానిక దాడులు చేసింది. సరిహద్దు వెంబడి జరిగిన ఈ వరుస దాడులలో 28 మంది పౌరులు మరణించారు. అలాగే 49 మంది తీవ్రంగా గాయపడ్డారు.

​ఈ చర్యలకు ప్రతికారం తీర్చుకునే క్రమంలో అఫ్గాన్ తాలిబన్ దళాలు పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎదురుదాడులు (Counter Attacks) చేశాయి. పాకిస్తాన్ చర్యలపై భారత ప్రభుత్వం (Indian Government) తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ దాడులను అఫ్గానిస్తాన్ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs) అభివర్ణించింది. ప్రాంతీయ శాంతికి (Regional Peace) ఇది తీవ్ర ముప్పు అని భారత్ హెచ్చరించింది. అఫ్గానిస్తాన్ ప్రాదేశిక సమగ్రతకు (Territorial Integrity) భారత్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

అఫ్గాన్ ప్రజలకు మానవతా దృక్పథంతో అభివృద్ధి సహాయాన్ని (Humanitarian Aid) నిరంతరం కొనసాగిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) స్పష్టం చేశారు. మానవతా సహకారం ద్వారా అఫ్గానిస్తాన్‌కు అండగా నిలిచేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. సరిహద్దుల వద్ద నెలకొన్న ఈ వరుస సైనిక దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న తరుణంలో భారత్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp