
అమరావతి, సూర్య న్యూస్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతం (Bay of Bengal) పరిసర ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతం వెంబడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (AP Disaster Management) హెచ్చరించింది.
ముఖ్యంగా శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి చిరు జల్లులు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల కారణంగా కొన్ని తీరప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తీర ప్రాంతాల (Coastal Areas) ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. సంబంధిత విపత్తు నిర్వహణ బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు (Fishermen) ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




