
కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : అంబరాన్నంటిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుకుత్బుల్లాపూర్ నియోజకవర్గం (Quthbullapur Constituency) టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day celebrations) అత్యంత ఘనంగా జరిగాయి. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంగూరు గోవిందరావు, మేడ్చల్ జిల్లా (Medchal District) ప్రధాన కార్యదర్శి గడ్డమీది అశోక్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశభక్తి నినాదాలతో ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల అలుపెరగని త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు. నియోజకవర్గ ప్రజలకు, సాటి జర్నలిస్టులకు వారు తమ హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ముఖ్యం
ఈ స్వాతంత్ర్య పండుగ వేళ యువతకు నాయకులు దిశానిర్దేశం చేశారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా యువత సామాజిక బాధ్యతతో దేశాభివృద్ధిలో చురుగ్గా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. దేశభక్తి, ఐక్యత మరియు జాతీయ సమగ్రత వంటి ఉన్నతమైన విలువలను ప్రతి పౌరుడు నిలబెట్టాలని, నాటి స్వాతంత్ర్య స్ఫూర్తిని నేటి తరాలకు అందించాలని వారు కోరారు.

జర్నలిస్టుల హక్కుల కోసం ఒకే గొంతుక..
స్ఫూర్తిదాయక తీర్మానంఈ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా పాత్రికేయుల ఆత్మగౌరవ వేదికగా, వారి హక్కుల సాధన కోసం ఒక స్ఫూర్తిదాయక తీర్మానంగా నిలిచాయి. రాష్ట్ర కమిటీ సభ్యులు నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం (Journalists Welfare) కోసం అనేక ఆందోళనలు, రాజీలేని పోరాటాలు చేస్తూ వారి పక్షాన నిలబడిన ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని గుర్తు చేశారు. జర్నలిస్టుల ఐక్యతే మన బలమైన ఆయుధమని, అందరం ఒకే గొంతుకతో హక్కుల కోసం ముందుకెళ్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఐక్యతా కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్, బాలరాజు, సంజీవరెడ్డి, రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చిన్నబాబు, సురేష్ పరుచూరి, పి.శంకర్, జోగు వెంకటేష్, కోటేశ్వరరావు, సామల వెంకటేష్, సౌభాగ్యవతి, బబ్ బాయ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



