
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ (Duleep Trophy)లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తనదైన ముద్ర వేశాడు. సెంట్రల్ జోన్తో జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో కలిపి 132 పరుగులు సాధించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్తో ఈస్ట్ జోన్ను ఫైనల్కు చేర్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.
మొత్తం 124 బంతులను ఎదుర్కొని 132 పరుగులు చేసిన వైభవ్ తన ఇన్నింగ్స్లో 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదాడు. భారీ షాట్లతో విరుచుకుపడి ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. సుదీర్ఘ ఫార్మాట్లో కూడా పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలనని ఈ అద్భుత ప్రదర్శన ద్వారా నిరూపించాడు.
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదుర్స్
బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ వైభవ్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా రాణించడంతో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్పై ఘన విజయం సాధించింది. ఈ అద్భుతమైన గెలుపుతో ఈస్ట్ జోన్ జట్టు నేరుగా దులీప్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



