
ముంబై, సూర్య న్యూస్ : ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో (IIT Bombay) బీటెక్ సెకండియర్ చదువుతున్న సాహిల్ రవీంద్ర వాకోడే అనే విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన సాహిల్.. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన విద్యార్థి. తన కుమారుడి మృతికి క్యాంపస్లో ఎదురైన కుల వివక్షే ప్రధాన కారణమంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో.. ప్రొఫెసర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రొఫెసర్పై కుల దూషణ ఆరోపణలు
గత మూడు నెలలుగా తన కుమారుడు తీవ్రమైన మానసిక వేధింపులకు గురయ్యాడని సాహిల్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ్ తన కుమారుడిని కులం పేరుతో అవమానకరంగా మాట్లాడారని, కుల దూషణకు పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వేధింపులు తాళలేకనే సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు.
చాట్ జీపీటీ చూసి రాశాడన్న వర్సిటీ
అయితే, విద్యార్థి తండ్రి చేస్తున్న ఆరోపణలపై ఐఐటీ బాంబే యాజమాన్యం భిన్నమైన వాదనను వినిపిస్తోంది. సాహిల్ ఒక పరీక్షను చాట్ జీపీటీ (ChatGPT) చూసి రాశాడని, ఆ విషయాన్ని పసిగట్టిన ప్రొఫెసర్ అతడిని కేవలం మందలించారని విద్యాసంస్థ స్పష్టం చేసింది. కాపీయింగ్ విషయంలోనే మందలించారని, కుల వివక్ష ఆరోపణల్లో వాస్తవం లేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సున్నితమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



