కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ అల్టిమేటం: బడ్జెట్ లో హామీలకు నిధులు కేటాయించకపోతే నిలదీస్తాం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తవుతున్నా హామీల అమలులో విఫలమైందని విమర్శిస్తూ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాబోయే బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు నిధులు కేటాయించకపోతే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.











