|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

IND vs ENG 3rd ODI : లార్డ్స్ లో సెంచరీతో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కానీ టీమిండియాకు ఘోర పరాభవం.. గంభీర్ చేసిన ఆ తప్పే కొంపముంచిందా?

London, Surya News: లార్డ్స్ (Lord’s) వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా (Team India) 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ పరాజయంతో ఇంగ్లండ్ టూర్ లో భారత్ టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

​తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ (England) నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెన్ డక్కెట్ 135 బంతుల్లో 141 పరుగులు చేసి భారీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ లు ఆడారు. బుమ్రా (Jasprit Bumrah) దూరం కావడం భారత బౌలింగ్ లైనప్ ను తీవ్రంగా దెబ్బతీసింది. భారత బౌలర్లు దారుణంగా విఫలమవగా, ఇంగ్లండ్ బ్యాటర్లు ఆఖరి ఐదు ఓవర్లలో ఏకంగా 82 పరుగులు పిండుకున్నారు.

​భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్ మన్ గిల్ (Shubman Gill) అద్భుత ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ 77 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli) 74 పరుగులతో రోహిత్ కు అండగా నిలిచాడు. రోహిత్ శర్మ 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేసి తన 34వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లో సేనా (SENA – సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సిక్సర్లు (343) కొట్టిన బ్యాటర్ గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. గేల్ (342), విరాట్ (179) లను అతడు వెనక్కి నెట్టాడు. అలాగే ఇంగ్లండ్ గడ్డపై 1500 పైన వన్డే రన్స్ చేసిన తొలి విదేశీ బ్యాటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు.

జాకబ్ బెథెల్ (Jacob Bethell) బౌలింగ్ లో రోహిత్ క్లీన్ బౌల్డ్ కావడంతో భారత వికెట్ల పతనం మొదలైంది. ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ అయ్యర్ (0), కేఎల్ రాహుల్ (12) తీవ్రంగా నిరాశపరిచారు. భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ 4 వికెట్లు తీశాడు.

ఈ ఓటమికి కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తీసుకున్న నిర్ణయాలే కారణమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తే, భారత్ మాత్రం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. మ్యాచ్ విన్నర్ కుల్దీప్ యాదవ్ ను బెంచ్ కు పరిమితం చేయడం పెద్ద తప్పుగా మారింది. యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఏకంగా 97 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. రాబోయే వరల్డ్ కప్ కోసం గంభీర్ చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp