|  
FLASH NEWS
India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  •  హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఫన్నీ కౌంటర్‌తో క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్  •  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు కీలక నివేదికలు  • 
Skip to content

విద్యా సంస్థల పాత్రే విద్యార్థుల భవిష్యత్తుకు ఆధారం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్: విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. గురువారం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే, అనంతరం రిబ్బన్ కట్ చేసి విద్యాసంస్థను ప్రారంభించారు.

​ఈ సందర్భంగా కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటైన ఈ పాఠశాల అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతుందని ఆకాంక్షించారు. పిల్లల బంగారు భవిష్యత్తు రూపకల్పనలో కేవలం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా కీలక బాధ్యత వహించాలని ఆయన సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని యాజమాన్యానికి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు నరేందర్ కృష్ణ, నవీన్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే నాయకులు అడప శేషు, గుబ్బల లక్ష్మీనారాయణ, కుంటి మల్లేష్, దుబాయ్ శ్రీను, సురేష్ గుప్తా తదితరులు పాల్గొని పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp